యూపీ రాజధాని లక్నోకు సమీపంలోని ఇతౌంజాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. స్థానికంగా ట్రాక్టర్ పందేలు నిర్వహించారు. ఎవరి ట్రాక్టర్ బలంగా ఉందో చూపించాలి. గెలిచిన వారికి రూ.15 వేల రివార్డును కూడా నిర్వాహకులు ప్రకటించారు. పందెం మొదలైన కాసేపటికే ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రేక్షకులు చూస్తుండగానే ట్రాక్టర్ నడిపిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.