అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ జూన్ 5న అడుగుపెట్టారు. 10 రోజుల మిషన్లో భాగంగా సునీత, విల్మోర్ ఈ యాత్ర చేపట్టారు. జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరుగుపయనం కావాల్సిఉండగా.. స్టార్లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ల్యాండింగ్ను వాయిదా వేశారు. ఆ తర్వాత జూన్ 26న వీరు తిరుగు ప్రయాణం కానున్నట్లు నాసా ప్రకటించగా.. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది.