చెన్నై నగరంలో పశువుల పెంపకంపై నిషేధం అమలు చేసేలా కొత్త చట్టం రూపొందించాలని కోరుతూ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇటీవల కాలంలో తిరువొత్తియూరు తదితర ప్రాంతాల్లో గేదెలు, ఎద్దులు, రహదారిపై వెళ్తున్న పాదచారులను ఢీకొట్టి గాయపరిచాయి. ఇలాంటి సంఘటనలు నగరంలో పదే పదే పునరావృతం అవుతుండటంతో పశువుల పెంపకంపై నిషేధం విధించాలని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.