రైలు ఢీ.. తెగిపడిన రెండు కాళ్లు, యువతి మృతి (షాకింగ్ వీడియో)

56చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో సోమవారం అలీగంజ్ ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పై ఇయర్‌ఫోన్‌లు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువతిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాద ఘటనలో ఆమె రెండు కాళ్ళు తెగిపోయి.. తలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్