ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో అరెస్టు అయిన మాజీ డీసీపీ రాధాకిషన్పై కూకట్పల్లి పీఎస్లో గతంలో నమోదైన కేసును సనత్నగర్ పీఎస్కు బదిలీ చేశారు. బెదిరించి కుమార్తె పేరుమీద రాధాకిషన్ ఇల్లు రాయించుకున్నారని బాధితుడు సుదర్శన్ సనత్ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వాంగ్మూలం నమోదు చేశారు. సుదర్శన్ వాంగ్మూలం ఆధారంగా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.