వాకీ టాకీలు పేలిన ఘటనలో 9 మంది మృతి.. 300 మందికి గాయాలు

58చూసినవారు
వాకీ టాకీలు పేలిన ఘటనలో 9 మంది మృతి.. 300 మందికి గాయాలు
లెబనాన్‌లో వరుస పేలుళ్లు ఆందోళన రేకిత్తిస్తున్నాయి. లెబనాన్‌లోని హిజ్బుల్లాకు చెందిన కీలక స్థావరాల వద్ద బుధవారం వాకీ టాకీలు పేలిన ఘటనలో 9 మంది మృతి చెందగా, 300 మందికి పైగా గాయపడ్డారు. లెబనాన్ లోని అనేక ప్రాంతాలలో గృహ సౌర శక్తి వ్యవస్థలు, ల్యాండ్ లైన్ టెలిఫోన్లు కూడా పేలినట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. కాగా అంతకుముందు రోజు లెబవాన్ వ్యాప్తంగా పేజర్లు పేలడంతో 12 మంది చనిపోగా, దాదాపు 3,000 మంది గాయపడ్డారు.

సంబంధిత పోస్ట్