కేరళలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. 5 రోజులుగా భోజనం చేయని 27 ఏళ్ల వ్యక్తి కుట్టిపురంలోని బస్టాండ్ ఆవరణలో చనిపోయిన పిల్లి మాంసాన్ని తింటూ కనిపించాడం సంచలనంగా మారింది. దీంతో షాకికి గురైన స్థానికులు పోలీసులుకు సమాచారం చేరవేశారు. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రిలోకి తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక పరీక్షల్లో అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు బయటపడింది.