ఈ ‘మైసూరు మహారాజు’కు సొంతిల్లు, కారు లేదట..
లోక్సభ ఎన్నికల్లో రాజ కుటుంబీకులూ ప్రత్యక్ష బరిలోకి దిగుతున్నారు. పూర్వపు మైసూరు రాజకుటుంబానికి చెందిన యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మైసూరు నుంచి బీజేపీ తరుపున నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల విలువ మొత్తంగా రూ.4.99 కోట్లుగా ప్రకటించారు. సొంత ఇల్లు, భూమి, కారు లేదని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనడం గమనార్హం.