క్రికెట్ ఆడిన కేంద్రమంత్రి.. నెటిజన్లు ఫిదా!

74చూసినవారు
కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి మన్సుక్ మాండవీయ యువకులతో కలిసి క్రికెట్ ఆడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. గుజరాత్ లోని పోరుబందర్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన స్థానికులతో కలిసి క్రికెట్ ఆడారు. 51 ఏళ్ల వయసున్న కేంద్ర మంత్రి మైదానంలో యువకుడిలా పరిగెడుతూ బౌలింగ్, ఫీల్డింగ్ తో పాటు బ్యాటింగ్ చేశారు.