23 మంది పాక్ సిబ్బందిని రక్షించిన ఇండియా నేవీ

80చూసినవారు
23 మంది పాక్ సిబ్బందిని రక్షించిన ఇండియా నేవీ
ఇండియన్ నేవీ మరోసారి సముద్రపు దొంగల ఆటకట్టించింది. అరేబియా సముద్రంలో గల్ఫ్ ఏడెన్‌కు సమీపంలో ఉన్న సోకోట్రా ద్వీప సమూహానికి 90 నాటికల్ మైళ్ల దూరంలో గురువారం నాడు ఇరాన్ దేశానికి చెందిన చేపల బోటు హైజాక్‌కు గురైంది. సముద్రాల్లో యాంటీ పైరసీలో భాగంగా దాదాపు 12 గంటలు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టి చేపల బోటుతోపాటు అందులోని దాదాపు 23 మంది పాకిస్థాన్‌కు చెందిన సిబ్బందిని భారత నౌకదళం సురక్షితంగా కాపాడింది.

సంబంధిత పోస్ట్