మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న మనోహర్ శుక్రవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టడంతో కొన్నాళ్ల నుంచి మనోహర్ తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అప్పుల బాధ తాళలేక మనస్థాపానికి గురై చెట్టుకు ఉరి వేసుకుని మనోహర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.