సీఎం రేవంత్ దావోస్ పర్యటనకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మాజీ MP హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. "రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల కోసం దావోస్ వెళ్లిన సీఎంపై కేటీఆర్ వ్యాఖ్యలు సరిగా లేవు. తొందరపడి కామెంట్స్ చేస్తే BRS పార్టీనే నష్టపోతుంది. పదేళ్లు పాలించిన BRS ఒక్క పనీ చేయలేదు.. ఇప్పుడు 10 రోజులు ఓపిక పట్టకపోతే ఎలా?" అని వీహెచ్ ప్రశ్నించారు.