కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్ సల్మా ఫాతిమా

84చూసినవారు
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్ సల్మా ఫాతిమా
తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ కు చెందిన కౌన్సిలర్ సల్మా ఫాతిమా జుబేర్ లాల శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. రంజిత్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్