Mar 01, 2025, 10:03 IST/ములుగు
ములుగు
ఇంటర్ పరీక్షలపై సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ లో ములుగు కలెక్టర్
Mar 01, 2025, 10:03 IST
ఇంటర్ పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర శనివారం పాల్గొన్నారు. శాంతి కుమారి మాట్లాడుతూ.. మార్చి 5 నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయన్నారు. ప్రశ్నపత్రాల తరలింపు పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు సెల్ ఫోన్ అనుమతి లేదన్నారు.