Jul 11, 2024, 07:07 IST/వరంగల్ (వెస్ట్)
వరంగల్ (వెస్ట్)
హనుమకొండలో న్యాయవాదుల నిరసన
Jul 11, 2024, 07:07 IST
సిద్దిపేట లో లాయర్ పై పోలీసులు అక్రమ కేసు పెట్టడాన్ని నిరసిస్తూ హనుమకొండ జిల్లా అదాలత్ సెంటర్ లో న్యాయవాదుల నిరసన చేపట్టారు. న్యాయవాదుల పై దౌర్జన్యలకు దిగిన పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ. కోర్ట్ ప్రాంగణంలో న్యాయవాదుల పై దాడులు నశించాలి అని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.