వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇటుకలపల్లి లో గురువారం బుర్ర వెంకటేశ్వర్లు అనే వ్యక్తిపై అతని తమ్ముడు శ్యామ్ సుందర్ కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో బుర్ర వెంకటేశ్వర్లు తలకు గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం వరంగల్ కి తరలించారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో గొడవ జరిగిందని ప్రాధమిక సమాచారం.