ఒక్కరోజే 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు

54చూసినవారు
ఒక్కరోజే 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు
దేశవ్యాప్తంగా గురువారం విదేశాలకు వెళ్లే పలు విమానాలకు బాంబు బెదిరింపు హెచ్చరికలు వచ్చాయి. దేశంలోని 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఎయిరిండియా, విస్తారా, ఇండిగోలకు చెందిన 20 విమానాలకు, ఆకాశ ఎయిర్‌కి చెందిన 14 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు విమానయాన సంస్థలు తెలిపాయి. దీంతో 11 రోజుల్లో సుమారు 250 విమానాలకు దుండగుల నుంచి బాంబు బెదిరింపులు వచ్చాయి.

సంబంధిత పోస్ట్