ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలి

79చూసినవారు
ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలి
ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు సమష్టిగా కృషి చేసి ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలని వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఆర్టీసీ డీఎం ప్రసూన లక్ష్మి అన్నారు. శనివారం డిపో ఆవరణలో ఆమె జెండాను ఆవిష్కరించి లక్ష్యమనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిపో ఆదాయం పెంచేందుకు సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో సహాయ మేనేజర్ భవాని, సహాయ ఇంజినీర్ ప్రభాకర్, సూపర్వైజర్లు, కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్ లు పాల్గొన్నారు.