
నర్సంపేట: కెరియర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో కార్యశాల నిర్వహణ
ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ నర్సంపేట కెరియర్ గైడెన్స్ సెల్ ఆధ్వర్యంలో "పోటీ పరీక్షలు- విద్యార్థుల సన్నద్ధత" అనే అంశం మీద కార్యాశాలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ మల్లం నవీన్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ములుగు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. మల్లేశం, విశిష్ట అతిధిగా గ్రూప్ 2 మహిళ టాపర్ కుమారి బిళ్ళ శ్రావణి పాల్గొనగా డాక్టర్ ఎం సోమయ్య సమన్వయకర్తగా వ్యవహరించారు.