హత్రాస్ తొక్కిసలాట ఘటనపై ఒవైసీ ఏమన్నారంటే?

60చూసినవారు
హత్రాస్ తొక్కిసలాట ఘటనపై ఒవైసీ ఏమన్నారంటే?
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో 120 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. హత్రాస్‌లో చోటుచేసుకున్న ఘటన బాధాకరమన్నారు. ఘటన ఎలా జరిగింది అనే దానిపై సరైన దర్యాప్తు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనలో గాయపడినవారికి సరైన చికిత్స అందుతుందని ఆశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్