ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా దేవల్ బ్లాక్ అడవిలో ఓ వింత ఆలయం ఉంది. లాతూ మందిరంగా పిలిచే ఈ ఆలయంలోకి ప్రవేశించే ముందు భక్తులు కళ్లకు గంతలు కట్టుకుంటారట. అంతేకాదు పూజారి కూడా నోటికి, కళ్లకు గంతలు కట్టుకోవాలంట. ఇక్కడ నాగరాజు తన విలువైన రత్నాన్ని ధరించి దర్శనమిస్తాడట. భక్తులు నేరుగా ప్రకాశిస్తున్న మణిని చూస్తే గుడ్డివారవుతారని నమ్ముతారు. అయితే ఈ ఆలయం ప్రతి రోజు తెరిచి ఉండదు. కేవలం వైశాఖ పౌర్ణమి రోజు మాత్రమే తెరుస్తారు.