కేదార్‌నాథ్‌ యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు క్షేమం

67చూసినవారు
కేదార్‌నాథ్‌ యాత్రలో చిక్కుకున్న తెలుగు యాత్రికులు క్షేమం
కేదార్‌నాథ్‌ యాత్రలో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు సురక్షితంగా ఉన్నారు. ఆపదలో ఉన్నామని, కిందకు చేరుకోలేకపోతున్నట్లు శుక్రవారం పలువురు యాత్రికులు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడిని సంప్రదించారు. ఈ విషయాన్ని వెంటనే మంత్రి లోకేశ్‌, సీఎం కార్యాలయం దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. ఉత్తరాఖండ్, కేంద్ర ప్రభుత్వ అధికారులతో మంత్రి లోకేశ్‌, సీఎంఓ అధికారులు మాట్లాడారు. దీంతో శనివారం వారిని సురక్షిత ప్రాంతానికి చేర్చారు.

సంబంధిత పోస్ట్