యూపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సురేష్ (28) అనే వ్యక్తిని ఎ. మహేంద్ర, రాజేంద్ర, ధర్మేంద్ర పట్టపగలు కిందపడేసి సుత్తితో కొట్టారు. బాధితుడు కొట్టవద్దు అని వేడుకున్నా కూడా వదల్లేదు. ఈ ఘటన ఆ ప్రాంతంలో భయాందోళనకు గురి చేసింది. ఎందుకు కొట్టారో స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మహరాజ్పూర్ పోలీస్ స్టేషన్లోని ముగ్గరిపై కేసు నమోదు చేసుకున్నారు.