ఢిల్లీలోని రోహిణి జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. అమన్ విహార్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్పై అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం వేలాడుతూ కనిపించింది. గమనించిన బాటసారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడిని హర్ప్రీత్ (35)గా గుర్తించారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు.