అద్దంకి: కొరవడిన ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ

అద్దంకి నియోజకవర్గంలో దాబాలు, రెస్టారెంట్లు, పలు దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారుల పర్యవేక్షణ కొరవడిందని నియోజకవర్గ జై భీమ్ రావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు ఆదివారం అద్దంకిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విమర్శించారు. కల్తీ నూనెతో విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనివలన ప్రజలు ప్రాణాంతక రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్