కొరిశపాడు: పంచాయతీరాజ్ ఈఈ కి నివాళులర్పించిన బలరాం

కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన పంచాయతీ రాజ్ ఈ ఈ హరే రామకృష్ణ గుండెపోటుతో మృతి చెందిన నేపద్యంలో శుక్రవారం చీరాల మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి పమిడిపాడు లో ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో హరే రామకృష్ణ నిబద్ధతతో పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నాడని బలరాం గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్