కొరిశపాడు: రేపటి నుండి రెవెన్యూ గ్రామ సభలు

కొరిశపాడు మండల పరిధిలో రిసర్వే పూర్తి అయిన గ్రామాలలో రేపటి నుంచి రెవెన్యూ గ్రామ సభలు జరుగుతాయని తాసిల్దార్ సుబ్బారెడ్డి సోమవారం తెలియజేశారు. గ్రామాలలో రిసర్వే లో సమస్యలు ఉన్న రైతుల కోసం రెవిన్యూ గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తాసిల్దార్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ గ్రామ సభలు జరిగే వివరాలను వెల్లడించారు.

సంబంధిత పోస్ట్