ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ ఎలీస్ పెర్రీ రేపు జరిగే భారత్-ఆసీస్ రెండో టీ20 మ్యాచ్తో అరుదైన ఘనత సాధించనుంది. ఈ మ్యాచ్తో పెర్రీ ఆసీస్ తరఫున 300 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన తొలి మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించనుంది. అలాగే, ఉమెన్స్ క్రికెట్ చరిత్రలో 300 ప్లస్ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడిన 4వ ఉమెన్ క్రికెటర్గా రికార్డు సాధించనుంది. కాగా, మిథాలీ రాజ్(333), చార్లెట్ ఎడ్వర్డ్స్(309), సూజీ బేట్స్(309) ఈ ఘనత సాధించారు.
గంజాయి బ్యాచ్ హల్ చల్.. రాడ్లతో దాడి