కేసీఆర్ లేఖపై నేడు జస్టిస్ నరసింహారెడ్డి సమీక్ష

TG: పవర్ కమిషన్‌ విచారణకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ పంపిన లేఖపై పవర్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఈరోజు సమీక్ష చేపట్టనున్నారు. కేసీఆర్ పంపించిన లెటర్ కమిషన్‌కి అందిందని, పలు అంశాలను ప్రస్తావించారని తెలిపింది. కేసీఆర్ కమిషన్‌కు పంపిన లేఖలో.. ఆయన చెప్పిన వివరాలకు వాస్తవాలకు సరిపోల్చాల్సి ఉంటుందని కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్