నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపట్టింది. హైదరాబాద్ లోని రాజ్భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో కార్యకర్తలు అక్కడికిి చేరుకుని ఆందోళన చేయడంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.. పోలీస్ స్టేషన్కు తరలించారు.