ఘనంగా డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి

బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండల అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి, రాజేందర్, నరేందర్, రమణ, పడకంటి గంగయ్య, ఆర్మూర్ మోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.