మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ సర్పంచ్ నాగేష్, సుధాకర్

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ గా గురువారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్బంగా హైదరాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేల్పూరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. బాధ్యతలు స్వీకరించిన మానాల మోహన్ రెడ్డికి మాజీ సర్పంచ్ నాగేష్, సుధాకర్ పుష్పగుచ్చాలు అందజేసి, శాలువాలు కప్పి శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు.