పాఠశాలలో తనిఖీ చేసిన జిల్లా విద్యాధికారి

వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో శుక్రవారం ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ సందర్శించారు. ఇందులో భాగంగా పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకాన్ని తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరుపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులు సమయ వేళలు పాటించాలన్నారు. అనంతరం ఉపాధ్యాయ హాజరు పట్టికను పరిశీలించి పాఠశాలలో ఉన్న విద్యార్థుల అవసరాలపై ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు.