3 నెలలకు కోటి టన్నుల ఇసుక: మంత్రి కొల్లు

73చూసినవారు
3 నెలలకు కోటి టన్నుల ఇసుక: మంత్రి కొల్లు
AP: రాష్ట్రంలో అందరికీ ఉచిత ఇసుక అందజేయనున్నామని గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. త్వరలో దీనిని అమలు చేసేలా శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రతి ఒక్కరికీ, ప్రతి రోజూ ఉచిత ఇసుక అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు. వ‌చ్చే సెప్టెంబరు వరకు కోటి టన్నుల ఇసుక అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నామ‌ని వివ‌రించారు.

సంబంధిత పోస్ట్