చెరువుకు గండి.. నీట మునిగిన 50 ఇళ్లు (వీడియో)

72చూసినవారు
భారీ వర్షం కారణంగా ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని పెద్ద చెరువుకు గండి పడింది. దీంతో చెరువుకు ఆనుకొని ఉన్న పలు గ్రామాలు నీట మునిగాయి. 50 ఇళ్లల్లో నీరు చేరింది. ఒక్కసారిగా ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రాంతాలను మంత్రి కొలుసు పార్థసారధి, ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్