ప్రమాద ఘటనలపై స్పందించిన వైఎస్ జగన్

82చూసినవారు
ప్రమాద ఘటనలపై స్పందించిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో కుండపోత వర్షాలతో ప్రజలు వణికిపోతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలు కోల్పోవడంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్