తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేడ్కర్ గురుకులంలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో 110 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. కలుషిత ఆహారం తినడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు వైద్యులు వెల్లడించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.