అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డు ఈద్గా మైదానంలో వరుణుడి కరుణ కోసం శనివారం ముస్లిం సోదరులు సామూహిక ప్రత్యేక నమాజ్ ఆచరించారు. దాదాపు వెయ్యిమందికిపైగా ముస్లిం సోదరులు హాజరు కాగా ప్రభుత్వ ఖాజీ మొహమ్మద్ సైఫుల్లా, ఉలమాల ఆధ్వర్యంలో ప్రార్థనలు జరిగాయి. మౌలానా జుబేర్ నమాజ్ చేయించారు.