ద్విచక్ర వాహనాల దారులు తప్పక హెల్మెట్ ధరించాలి: జడ్జి సుభాన్

68చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి బండి సుభాన్, డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో గురువారం హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి అంటూ నినాదాలు చేస్తూ ప్రధాన కూడళ్లలో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. టీ సర్కిల్లో జూనియర్ సివిల్ జడ్జి బండి సుభాన్ మాట్లాడుతూ ద్విచక్రవాహనంలో ప్రయాణించువారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్