ఒకే వేదికపై టీడీపీ, వైసీపీ అభ్యర్థుల సతీమణులు

54చూసినవారు
తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి సతీమణి కవితమ్మ వైసీపీ తరఫున నామినేషన్ వేసేందుకు బుధవారం ఆర్ఓ కార్యాలయానికి వచ్చారు. ఆదే సమయంలో తంబళ్లపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్ర రెడ్డి సతీమణి కల్పన రెడ్డి, సోదరుడు మంత్రి గిరిధర్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఇద్దరిని కేంద్రంలోకి ఆహ్వానించారు. ఎన్నికల నిబంధనల మేరకు ఒకరి తరువాత మరొకరు నామినేషన్ వేయడానికి అనుమతించారు.