ఏపీలో మరో దారుణ హత్య

1568చూసినవారు
ఏపీలో మరో దారుణ హత్య
ఏపీలో మరో దారుణ హత్య చోటు చేసుకుంది. రషీద్‌ సంఘటన మరువక ముందే మరో దారుణ హత్య చోటు చేసుకుంది. విశాఖ జిల్లా అగనంపూడి జంక్షన్ వద్ద క్యాబ్ డ్రైవర్ సూర్య(25)ను ఓ దుండగుడు కత్తితో పలు సార్లు పొడిచాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మల్కాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్