ఏపీలో మరో ఘటన.. ఐదుగురికి అస్వస్థత

70చూసినవారు
ఏపీలో మరో ఘటన.. ఐదుగురికి అస్వస్థత
ఏపీలో మరో ప్రమాద ఘటన చోటు చేసుకుంది. శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో ఐదుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎసిటానిలైట్ బ్యాగ్స్‌ను ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్‌కు మార్చుతుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎసిటానిలైడ్ అనే విషవాయువు పీల్చడం వల్ల ఐదుగురు అస్వస్థతకు గురయ్యారు. వారిని గాజువాక సింహగిరి ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్