సాధారణ విద్యుత్ ఛార్జీలు ఏ వర్గానికీ పెంచే ఆలోచన లేదని APERC ఛైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి తెలిపారు. రైల్వేశాఖకు సరఫరా చేస్తున్న విద్యుత్ ఛార్జీలు పెంచాలనే ప్రతిపాదన మాత్రమే ఉందని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా విషయాల్లో లోటుపాట్లు లేకుండా ప్రతి జిల్లాలోనూ పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నామని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలపై సమీక్షించిన అనంతరం ఆయన ఈ మేరకు వెల్లడించారు.