నడుము లోతు నీటిలో మృతదేహం తరలింపు (వీడియో)

69చూసినవారు
అల్లూరి ఏజెన్సీలో గిరిజన గ్రామాలు ఇప్పటికీ బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పాడేరు మండలం దేవపురం పంచాయతీ పరిధిలోని అర్జాపురం, తుమ్మలపాలెం, మునగపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖలో మృతి చెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్తులు అతి కష్టంగా తీసుకెళ్లారు. నడుము లోతు నీటిలో మృతదేహాన్ని తరలించారు. తమ గ్రామానికి బ్రిడ్జి నిర్మించి రాకపోకల సమస్యను పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్