వరద బాధితుల నుంచి పన్నుల వసూళ్లు..!

61చూసినవారు
వరద బాధితుల నుంచి పన్నుల వసూళ్లు..!
వరదలతో విజయవాడ వాసులు కష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వం వారంతా కోలుకొనే వరకూ అండగా ఉంటామని హామీ ఇచ్చింది. కానీ, విజయవాడ నగర పాలక సంస్థ తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. 15 రోజుల్లో ఇంటి పన్ను రద్దు చెల్లించకపోతే పెనాల్టీ పడుతుందని మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. వరద బాధితులకు ఇంటి పన్ను రద్దు చేయకపోగా..15 రోజుల్లో చెల్లించకపోతే పెనాల్టీ పడుతుందని హెచ్చరించడంపైన స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వామపక్ష పార్టీల నేతలు ఈ నిర్ణయంపైన నిరసన వ్యక్తం చేసారు.

సంబంధిత పోస్ట్