సీఎం రమేష్‌పై దాడి (వీడియో)

82చూసినవారు
అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్‌పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. నిన్న దేవరపల్లిలో సీఎం రమేష్ తరఫున బీజేపీ జెండాతో కూడిన డ్రోన్‌తో ఆ పార్టీ కార్యకర్తలు ప్రచారం చేశారు. దాన్ని గమనించిన వైసీపీ కార్యకర్తలు డ్రోన్‌ను ధ్వంసం చేశారు. అలాగే బీజేపీ కార్యకర్తలను చితకబాదారు. విషయం తెలుసుకున్న సీఎం రమేష్ దేవరపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకోగా.. అక్కడ ఆయనపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. దాంతో పీఎస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది.

సంబంధిత పోస్ట్