మద్యం అమ్మకాలపై నిషేధం: డీజీపీ

54చూసినవారు
మద్యం అమ్మకాలపై నిషేధం: డీజీపీ
ఏపీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ హరీష్ గుప్తా వెల్లడించారు. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని హోటళ్లు, లాడ్జీలలో తనిఖీ చేయాలని, అనుమానితులను అదుపులోకి తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.