డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ స్టెబిలైజేషన్ మిషన్లో పనిచేసిన భారతీయురాలైన మహిళాశాంతి పరిరక్షకురాలు మేజర్ రాధికసేన్ను ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు (2023)తో సత్కరించనుంది. గురువారం ఐరాస అంతర్జాతీయ శాంతిపరిరక్షకుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమెకు ఈ అవార్డు అందించనున్నారు. 2019లో మొదటిసారిగా ఈ అవార్డును మేజర్ సుమన్గవానీ అందుకోగా, రెండోసారి మేజర్ రాధికాసేన్ అందుకోనున్నారు.