కారంచేడు మండలంలోని ఆదిపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం బోర్డు సభ్యులు తమ పదవులకు మంగళవారం రాజీనామాలు చేశారు. రాష్ట్రంలో వైసీపీ పరాజయం పాలవ్వడంతో మనస్తాపంతోనూ, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారిని తొలగించాలని వచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని సొసైటీ అధ్యక్షుడు యర్రం లక్ష్మారెడ్డి, సభ్యులు వణుకూరి విజయభాస్కరరెడ్డి, అబ్బూరి మల్లికార్జునరావులు పేర్కొన్నారు.