గుంటూరు :చేతి వృత్తిదారులు ఐక్యంగా ఉద్యమించాలి

58చూసినవారు
గుంటూరు :చేతి వృత్తిదారులు ఐక్యంగా ఉద్యమించాలి
చేతివృత్తులను కబళిస్తున్న పారిశ్రామిక ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించి తమ హక్కులను కాపాడుకోవాలని సీపీఐ కార్యదర్శి అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. గుంటూరు కొత్తపేట సీపీఐ కార్యాలయంలో శనివారం చేతి వృత్తుదారుల సమితి సమావేశం జరిగింది. వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం ప్రతిష్ట కలిగి ఉందని చెప్పారు. 28 రకాలుగా ఉన్న చేతివృత్తిదారులను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలతో మభ్యపెడుతున్నారని విమర్శించారు.

సంబంధిత పోస్ట్