
గుంటూరు: ల్యాబ్ టెక్నీషియన్లు బాధ్యతగా పనిచేయాలి
గుంటూరు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పని చేసే ల్యాబ్ టెక్నీషియన్లతో సోమవారం డీఎంహెచ్ఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఆమె మాట్లాడుతూ పరీక్షలు చేసిన రిపోర్టులను సమయానికి ఇవ్వాలని సూచించారు. ల్యాబ్ పరీక్షల వివరాలను ల్యాబ్ వెలుపల ప్రదర్శించాలన్నారు. సమయానికి టీకాలు, సరైన వివాహ వయస్సు, సిజేరియన్ తగ్గింపు అంశాల్లో ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు.